Home » Yarlagadda Venkatrao
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.
గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
Andhrapradesh: గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కూటమి నేతలు, కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లింది. నామినేషన్ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఈ నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం (Telugu Desam Party), వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీచేస్తున్నారు.
నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.
త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లడం ఖాయమని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు విజయవాడ రూరల్ రామవరప్పాడులో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు విషయంలో ఒక మెట్టు కింద దిగిన పవన్ కళ్యాణ్కు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హ్యాట్సాఫ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిన్నటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వని అధికారులు ఇప్పుడెందుకు బస్సులిస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు.