Home » Yadadri Bhuvanagiri
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరిపట్టణంలోని గల్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
భువనగిరి జిల్లా మోట కొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదగిరి గౌడ్ 2013లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సాక్ష్యం చెప్పకుంటే రూ. కోటి ఇస్తామని ఆఫర్ చేశారు.
ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని షాపులు నకిలీ ఇక్కత్ చీరలు, నకిలీ ప్రింటెడ్ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Telangana: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.