Home » Yadadri Bhuvanagiri
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.
శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది.
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) నిర్మాణ పనుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తానని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. విచారణ కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన శనివారం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో వైటీపీఎ్సను పరిశీలించారు.
ఏడాదిగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్స)లో యంత్ర పరికరాలు, జీఐ బండిల్స్, అల్యూమినియం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎ్సలో చొరబడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్ర్కాప్గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందింది. ఈ ఘటన అట్లాంటా నగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్రావు, బాలమణి దంపతులు కిరాణ దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
గత బీఆర్ఎస్ సర్కారు పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్సగఢ్తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెలవు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద ్దసంఖ్యలో తరలివచ్చారు. 80వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా
‘‘మోసపోతే గోస పడతారని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినప్పటికీ వినలేదు. కాంగ్రె్సనే గెలిపించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా హత్యా రాజకీయాలు చేస్తోంది’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.