Home » West Bengal
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారంనాడు పలు సంక్షేమ, నియంత్రణ చర్యలను ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆలయాలకు ఒక కిలోమీటర్ దూరంలోపు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు.
పశ్చిమబెంగాల్లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్ ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన నజీముల్ అనే వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. చిన్న వయసులోనే పొరపాటున బంగ్లాదేశ్లోకి వెళ్లిపోయిన అతడు, ఎన్నో కష్టాల తర్వాత చివరకు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
కోల్కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్డేడియం వీవీఐపీ గేటు వెలుపలనున్న వివాదాస్పద ఫుట్బాల్ శిల్పాన్ని శనివారం ఉదయం కూల్చివేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్బాల్ శిల్పం కూల్చివేత జరిగినట్టు అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ బెంగాల్ పర్యటనలో ఆయనకు ఝల్మురి అమ్మిన విక్రమ్ సావోకు తాజాగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్టు విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2024 నాటి ‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్’ మెడికోపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతిపై CBIను నిలదీస్తూ ప్రత్యేక సిట్ కు ఉత్తర్వులిచ్చింది.
మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది. దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది.
పశ్చిమ బెంగాల్లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్.. పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్ను కాల్చిచంపిన షూటర్ రాజ్కుమార్ను ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.