Home » West Bengal
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మాజీ క్రికెటర్, ఎంపీ ఒకరు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు..
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
దుండగులు హర్గోబంద్ దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40) ఇంటిపై దాడి చేశారని, ఇంటిని లూటీ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోతూ కత్తులతో తండ్రీకొడుకులపై దాడి చేశారని, కత్తిపోట్లతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు అధికారి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా కేంద్రమేనని మమత అన్నారు. అల్లర్లను రెచ్చగొట్టేవారెవరైనా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
Chinese Prasad Offering In Mandir: దాదాపు 80 ఏళ్లనుంచి ఆ గుడిలో చైనీస్ న్యూడిల్స్ ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. ఆ గుడిలో అలా న్యూడిల్స్ పంచటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం వల్లే ఇప్పటికీ కూడా భక్తులకు న్యూడిల్స్ ప్రసాదం అందుతోంది.
ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని బహిరంగంగా మమతా బెనర్జీ సవాలు చేశారు.
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. మైనారిటీలు, వారి ఆస్తులకు తాము కాపాడతామని అన్నారు.
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రిక్రూట్మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.