Home » Vote
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేసింది. అత్యధికంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 కేసులు నమోదు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయి.
ఏపీలో ఫేక్ ఓటర్ల విషయంలో ఇటివల ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే 2021 తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో నకిలీ ఓట్ల అంశం క్రమంగా మరింత వేడెక్కుతోంది. 2021 తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని తేలడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం దొంగ ఓట్ల అంశం గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నకిలీ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. ఎంతలా అంటే ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల ఓట్లు ఐదారు నియోజకవర్గాల్లో ఉన్నాయి.
AP Bogus Votes Issues : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. 2019 ఎన్నికల్లో అడ్డదిడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లలో ఏ మేరకు పరిపాలన సాగింది..? ప్రజలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ ఏ మేరకు అమలు చేశారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు కూడా..
AP Bogus Voters Issue: ఎన్నికల అధికారులు.. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు.. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి.. ఇవే ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ పదే పదే చెప్పే మాటలు. అయితే.. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు ముందే బోగస్ ఓట్ల విషయంలో దారుణాతి దారుణాలు పాల్పడుతుంటే ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
AP Election 2024: అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం..
Andhrapradesh: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది.
ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.