Home » Viveka Murder Case
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
నేడు జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ 19కి వాయిదా పడింది. సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.
ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఆయనను 4 గంటలుగా సీబీఐ విచారిస్తోంది. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్తో పాటు పలు విషయాలపై మీడియా ఆయన్ను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజు ఎర్ర గంగి రెడ్డి చేసిన కాల్స్పై సీబీఐ విచారణ నిర్వహిస్తోందని తెలుస్తోంది.
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను (Bhaskar Reddy Bail Petition) సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ హైకోర్టులో చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గోప్యంగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని గత శనివారం (జూన్ 3, 2023) (అవినాశ్కు ముందస్తు బెయిల్ వచ్చిన రోజు) అరెస్ట్ చేసి, ఆ వెంటనే విడుదల చేసినట్లు సమాచారం.
అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా సీబీఐ పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసులో అవినాశ్ రెడ్డి కంటే ముందు ఎంతమంది నిందితులున్నారు?.. ఏ1 నుంచి ఏ7 వరకు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం...