Home » Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
హైదరాబాద్: వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. 161 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 18 కి వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది...
జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...
2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ!..
వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.
హైదరాబాద్: వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్గా మారింది. సీబీఐ చార్జిషీట్లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (Viveka Murder Case) సాక్షిగా గతేడాది అక్టోబర్ 7న వైస్ షర్మిల (YS Sharmila) సీబీఐ (CBI)కి వాంగ్మూలం (Testimony) ఇచ్చారు. ఈ కేసులో కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టులో సమర్పించింది.