Home » Vijayawada
దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నారు.
ఈ నెల 22 నుండి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్పై హోటల్ నిర్వాహకులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు.
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురానికి చెందిన కుమారి అనే యువతిపై ఈనెల 11న కొందరు హిజ్రాలు దాడి చేశారు.
ఒడిశా టు హైదరాబాద్ బస్సులో బ్రీఫ్ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్ జీవన్కిరణ్, ఇన్స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్వాచ్ నిర్వహించారు.
విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి. ఇన్స్టాగ్రామ్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైక్లు కొట్టుకున్నారు.. కన్ను కొట్టే ఎమోజీలు వంపుకున్నారు. అమ్మాయి 'ఐ లవ్ యూ'అని మెసేజ్ పెట్టింది.
మా అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారంటూ లిక్కర్ స్కాం కేసు నిందితుడు ఏ30 పైలా దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని..
మచిలీపట్నంలో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్లో హాల్ట్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమస్యలను పరిష్కరించటానికి వీలుగా గడువు పెంచవచ్చు. ఏ సమస్యా లేకుండా సీఆర్డీఏ అధికారులు ఎందుకు గడువు పొడిగిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి..