Home » Vijayawada
Warahi Celebrations: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి.
Jalaharati Corporation: తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారిన బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పును జూలై 2కు వాయిదా వేస్తూ ఏసీబీ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.
Pawan Kalyan: రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడదామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి సంవిధాన్ హత్య దివస్ను పాటిస్తామని అన్నారు.
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.
Police Ride: విజయవాడ, గవర్నర్పేట అట్టా రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంపై దాడి చేశారు.
చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు కోరారు.
MP Kesineni Chinni: నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్లో అనేక కాలనీలు, అపార్ట్మెంట్లో వందలాది సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
Konakalla fire on Jagan: గత ఐదేళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.