Home » Venigandla Ramu
Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. గుడివాడలో సీఎం జగన్ (CM JAGAN) ‘మేమంతా సిద్ధం’ సభలో అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారని సెటైర్లు వేశారు.
Andhrapradesh: గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్బై చెప్పేశారు. వైసీపీ నాయకుడు షేక్ మౌలాలి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శనివారం గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పార్టీలో చేశారు. మౌలాలికి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. రాక్షస పాలన వద్దు - రామునే కావాలి అంటూ టీడీపీలోకి చేరుతున్నారు. అధికార పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తూ నిన్న (శుక్రవారం) నందివాడ, నేడు గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Andhrapradesh: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో గుడివాడ ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్లో రాము పర్యటించారు. కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు. పాతచెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను రాము మీడియాకు చూపించారు.
Kodali Nani: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి..
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు.
గుడివాడ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము సమక్షంలో గుడ్లవల్లేరు మండల ప్రముఖులు, వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. డోకిపర్రు గ్రామ వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ పురిటిపాటి సుబ్బారావు, ఆరుగురు పంచాయతీ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.