Home » Vemireddy Prabhakar Reddy
అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. ‘రా కదలి రా’ సభల ద్వారా మేనిఫేస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2న నెల్లూరు, గురజాలలో.. 4న రాప్తాడులో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Assebly Election) సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్సీపీకి (YSRCP) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేశారు. ఈ మేరక సీఎం జగన్కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం వేమిరెడ్డి ఉన్నారు. ఆయన సతీమణి వచ్చేసి టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు.
నంద్యాల జిల్లా: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పిస్తారు.
AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..