Home » Vasantha Venkata Krishna Prasad
ప్రజావేదిక ధ్వంసం నుంచి జగన్ విధ్వంస పాలన మొదలైందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. గురువారం నాడు గొల్లపూడిలో టీఎన్ఎస్ఎఫ్ నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు పాల్గొన్నారు.
వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.
సీఎం జగన్( CM Jagan) ఆలోచన వల్ల ఏపీ దివాళా తీసిందని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖరావం కార్యక్రమంపై సోమవరాం నాడు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) హాజరయ్యారు.
స్థానిక సంస్థలను వైసీపీYSRCP) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మైలవరం టీడీపీ(TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. శనివారం నాడు రాయనపాడులో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసకరమైన వ్యక్తుల మధ్య ఇమడలేక పోయానని అన్నారు.
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నా వల్ల ఇబ్బందులు పడిన గుంటుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా క్షమాపణలు చెపుతున్నాను’’ అని అన్నారు.
అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన కోసం బీజేపీ - తెలుగుదేశం - జనసేన పార్టీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) కోరారు. మంగళవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలో టీడీపీ నాయకులతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.