Home » Vangalapudi Anitha
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు, ప్రముఖలు కూడా ఆయనను కలుస్తున్నారు.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు.
తిరుమల: తెలుగుదేశం నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు.
బాపట్ల జిల్లా, చీరాల మండలం ఈపురుపాలెంలో సుచిరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.
అమరావతి: హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బుధవారం వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణకు ముందు వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన హోంమంత్రికి రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.
ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోయి గంజాయి వాడకం, విక్రయాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మాజీ సీఎం జగన్ గంజాయిని కట్టడి చేయడానికి కనీసం ఒక్క రివ్యూ నిర్వహించలేదని మండిపడ్డారు.
సింహాచలం అప్పన్నను రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఘనంగా ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం వంటివి ఇచ్చారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు.
ఏపీలో శాంతిభద్రతలు, మహిళల రక్షణ విషయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు.