Home » Vangalapudi Anitha
ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు.
విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు.
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్తాన్ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలను పీడించకు తిన్నారని.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని హోం మంత్రి వంగలపూడి అనిత ( Anitha) విమర్శించారు.
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కె.గంగవరం మం. కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, మంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ పర్యటించారు.
ర్యాగింగ్ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనమే అయ్యింది. హాస్టల్ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి సభకు రాలేదని ఎద్దేవా చేశారు.
అమరావతి: రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ముందు గంజాయిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కోరారు.
Andhrapradesh: ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. 36హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ ఆమె సవాల్ విసిరారు.