Home » Vande Bharat Express
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20703) హిందూపూర్లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రజలకు మంచి శుభవార్త వచ్చింది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు 8 కోచ్లకు బదులుగా, 16 కోచ్లతో ప్రయాణించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.