Home » Uttarakhand
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.
అత్యాచారం చేసిన దోషిని శిక్షించే చట్టాన్ని ఇటీవలి కాలంలో కొందరు మహిళలు దుర్వినియోగపరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్ట్ (Uttarakhand High Court) వ్యాఖ్యానించింది. సహజీవనం చేసిన భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టింది.
ఉత్తరాఖండ్ లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరఖండ్లోని చమోలీ జిల్లాలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. అలకనంద నది ఒడ్డునున్న నమామీ గంగ ప్రాజెక్ట్ సైట్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
సెల్ఫీల పిచ్చితో కొందరు యువతీయువకులు చేసే పనులు ఎదుటి వారికి ఆగ్రహం కలిగిస్తుంటాయి. మరికొందరు ఇదే సెల్ఫీల పిచ్చితో చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. జంతువులతో ఫొటోలు తీసుకుంటూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు, కదులుతున్న సమయంలో..
ఉత్తర భారతం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. యమునా నది 206 మీటర్లకు మించి, ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలో రహదారులు జలమయంకావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించారు.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం రోడ్డు మీద నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది. అందులో మొత్తం 11 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఆహారం రుచికరంగా ఉండాలంటే టమాటాలు తప్పనిసరి. ఇవి ఒక్కోసారి కేజీ రూ.1కి కూడా అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు మాత్రం వీటి ధరను తల్చుకుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఓ కేజీ కొనేవారు ఇప్పుడు పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు ఈ ధరాభారాన్ని తట్టుకోలేక వెనుదిరిగిపోతున్నారు.