Home » Uravakonda
సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని రంగావీధిలో పారిశుద్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైనేజీలు శుభ్రం చేయించారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.
పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. అశేష భక్తజనం ‘నమో నారసింహా’ అని నినదిస్తుండగా.. స్వామివారి రథం ముందుకు సాగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలలు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ఉదయం ...
మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు ...
పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...
పోలింగ్ రోజున కోనుప్పలపాడులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ వర్గీయులు 24 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలమేరకు రిమాండ్కు తరలించేందుకు రాత్రి ఏర్పాట్లు చేశారు. వారిని తాడిపత్రి సబ్జైలు లేదా అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు...
బ్రహ్మోత్సవాలలో భాగంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురువారం గోవాహనంపై విహరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గోవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....
ఖరీఫ్ ఆరంభానికి ముందు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు అవుతున్నాయి. ఎనిమిది మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. డి.హిరేహాల్లో అత్యధికంగా 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్లో 28.0, విడపనకల్లులో 24.08, వజ్రకరూరులో 19.2, ఉరవకొండలో 16.2, కూడేరులో 8.2, గుంతకల్లులో 3.2, పామిడిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైం...
ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్ ...