Home » Uravakonda
వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రజాదర్బారులో ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయం లో శనివారం ఉదయం ప్రజాదర్బాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి విన్నవిం చారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఆర్టీసీలో ప్రవేశపెడు తున్న ఎలకి్ట్రకల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించరాదని ఆ ర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో వద్ద బుధవారం రెండో రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు.
వజ్రకరూరు పోలీస్ స్టేషనలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కేసులు పరిష్క రించలేక సతమవుతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. పోస్టింగ్ ఈ స్టేషనలో ఉన్న సిబ్బంది అటాచ పేరుతో వేరే స్టేషనకు వెళ్లారు. అలగే ఈ స్టేషనకు రావాలం టేనే సిబ్బంది హడలెత్తుతున్నట్లు స మాచారం. ఏఎస్ఐలు నలుగురు ఉండగా ప్రస్తుతం స్టేషనలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అ న్ని రంగాల్లోకి విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం పేర్కొన్నారు. స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్మాణం పూ ర్తయిన ఉమెన్స హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు.
భూముల రీ సర్వేని సం బంధిత రైతు సమక్షంలోనే చేసి, ఆ పొలంలోనే వారి ఈకేవైసీ పూర్తి చే యాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. మండలంలోని పొలికి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను జేసీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అధికారులు ఓ వైపు స్వచ్ఛత కార్యక్రమాల పేరుతో ఊదరగొడుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నా రు తప్ప సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీసీ కాలనీ లో సమస్యలు తిష్ట వేశాయి. దాదాపు రెండు వేల నివాస గృహాలు ఉన్న ప్పటికి కాలనీలో మౌలిక వసతులు కరువయ్యాయి.
ఈ యేడు ఎల్ని నో ప్రభావం ఉన్నందున రైతులు ఈ ఖరీఫ్లో వర్షాభావాన్ని తట్టుకునే పంటలనే సాగు చేయాలని ఏఓ హెచ పెన్నయ్య తెలిపారు. విడపనకల్లు లో సోమవారం రైతన్నా మీకోసం వారోత్సవాలను ఆయన రైతులతో క లిసి ప్రారంభించారు.