Home » UPI payments
వ్యక్తుల మధ్య నేరుగా నగదు బదిలీకి ఉద్దేశించిన మనీ రిక్వెస్ట్ యూపీఐ ఫీచర్ త్వరలో కనుమరుగు కానుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ద్వారా లావాదేవీలకు అనుమతించొద్దంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 1,2025 నుంచి యూపీఐ (UPI) ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) అంటే 'కలెక్ట్ రిక్వెస్ట్'ను పూర్తిగా నిలిపివేయనుంది.
నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లక్షల మంది యాప్ వినియోగదారులు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
22845 Crore Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.
పాస్వర్డ్.. OTP.. PIN.. ఇలాంటివేవి అవసరం లేకుండా కేవలం కళ్లతో పేమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతం ఇకపై ఆచరణలోకి రాబోతోంది. కేవలం బయోమెట్రిక్స్, ఫేస్ ఐడీ, ఐరిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు NPCI సన్నాహాలు చేస్తోంది.
ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. యూజర్లు అందరికీ వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
భారత్లో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్ చెల్లింపుల చరిత్ర మారిపోయింది.
యూపీఐ కారణంగా భారత్లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.
ఇటీవల కాలంలో భారత్లో డిజిటల్ చెల్లింపులు (Digital Payments) వేగంగా విస్తరిస్తున్నాయి. క్యూఆర్ కోడ్లు, యూపీఐ వంటి సౌకర్యాలతో రోజువారీ లావాదేవీలు మరింత సులభంగా మారాయి. కానీ ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపుల మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
New Money Rules: ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా ఐఆర్సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరికానుంది. జులై 15వ తేదీనుంచి వన్ టైమ్ పాస్వర్డ్ తప్పనిసరి అవ్వనుంది.