• Home » TSRTC

TSRTC

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో..  నిందితులపై కేసు నమోదు

TG News: తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో.. నిందితులపై కేసు నమోదు

తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌ లోగోను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో.. ఆ వార్తల్ని ఖండించిన సజ్జనార్

టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌..

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

Hyderabad: క్రికెట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు

గురువారం జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium) పరిసర ప్రాంతాలకు 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

TSRTC: 2 రోజుల్లో కోటిన్నర మంది!

త రెండు రోజుల్లో టీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్‌ చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..

TSRTC: విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు..

Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌‌కు ఇప్పటి వరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

Voters: ఓటేసి వద్దామని!

Voters: ఓటేసి వద్దామని!

భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.

Elections 2024: ఓటు వేసేందుకు సొంతూర్లకు ప్రజలు.. బస్టాండుల్లో రద్దీ అధికం

Elections 2024: ఓటు వేసేందుకు సొంతూర్లకు ప్రజలు.. బస్టాండుల్లో రద్దీ అధికం

Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.

TG: చలో ఏపీ!

TG: చలో ఏపీ!

సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం.

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ఆ ఛార్జీలు రద్దు..

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ఆ ఛార్జీలు రద్దు..

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి