Home » TS Politics
Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ‘‘భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేనే’’ అని అన్నారు.
Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడారని... వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు.
Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్..
Telangana: ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి మంచి సాంప్రదాయాన్ని పాటించారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని మండిపడ్డారు.
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్ల చైర్పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.