Home » Traffic Police
పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు.
Telangana: హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు.
‘‘నాన్నా నువ్వు నాకు కావాలి. నువ్వు మందు తాగి బండి నడపనని నాకు ప్రామిస్ చెయ్’’ అని డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వ్యక్తికి అతని కుమారుడితోనే కౌన్సెలింగ్ ఇప్పించి వార్తల్లో నిలిచారు
కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు (డిసెంబర్ 28, 2024న) మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీ చేశారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Traffic Police: క్రిస్మస్ పండగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన 50 వాహనదారులకు చలాన్లు విధించారు.
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసు ఫోర్స్ అసిస్టెంట్లుగా నియామకమై వెంటనే విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లను కుటుంబసభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.