Home » TMC
2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారత కూటమికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే యూపీలో అఖిలేష్తో, ఢీల్లీలో ఆప్తో కాంగ్రెస్ పార్టీ సీట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకుని సీట్ల పంపకంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సందేశ్ఖలీ లైంగిక హింస ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు విషయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని ఆరోపించింది.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసులో సోమవారంనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన టీఎంసీ నేత, లోక్సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారని, అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని సమాచారం.
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత, నటి మిమీ చక్రవర్తి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో నెక్ట్స్ ఏ పార్టీలోకి వెళతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ కు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారంనాడు ప్రకటించింది. జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నేత సుస్మితా దేవ్, నదిముల్ హఖ్, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఖరారు చేసింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం కూడా అనుమానమేనంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. మమత బీజేపీకి భయపడే ఆ పార్టీ భాషలోనే మాట్లాడుతున్నారని ముర్షీదాబాద్లో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ....
పశ్చిమ బెంగాల్లోని భారత కూటమిలో ఉద్రిక్తతకు కాంగ్రెస్ కారణమని మమతా బెనర్జీ మేనల్లుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని పార్టీ సీట్లను ఖరారు చేయడంలో చాలా ఆలస్యం చేసిందని అన్నారు.
టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.
పశ్చిమబెంగాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.