Home » TMC
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంతో.. ఆ రాష్ట్రంలో ప్రముఖ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం, డీప్యూటీ సీఎం మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
గవర్నర్ సీవీ ఆనంద బోస్పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతలు ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్న సందేశ్కాలీ, నిన్న చోప్రా.. నేడు కోల్కతా మహానగరం.
పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ సత్తా చాటుకుంది. శనివారం మధ్యాహ్నం వరకూ వెలువడిన ఫలితాల్లో 3 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించగా, మరో నియోజకవర్గంలోనూ ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీపై టీఎంసీ భారీ ఆధిక్యత కొనసాగుతోంది. దీంతో టీఎంసీ క్లీన్ స్వీప్ దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు.
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మరోసారి ఉప ఎన్నికల బరిలో హోరాహోరీగా తలబడనున్నాయి. పశ్చిమబెంగాల్ లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో గెలుపుపై రెండు పార్టీలు గట్టి ధీమాతో ఉన్నాయి.
ప్రతిపక్ష నేతల కేసుల్లో న్యాయమూర్తులు న్యాయం చేయడానికి భయపడుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.
పశ్చిమబెంగాల్ లోని అధికార టీఎంసీకి, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా బారానగర్ నుంచి ఎన్నికైన సయాంతిక బెనర్జీ, భగవాన్గోల నుంచి ఎన్నికైన రెయత్ హుస్సేన్ సర్కార్ల చేత స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారంనాడు ప్రమాణ చేయించారు. దీంతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కన్నెర్ర చేశారు.
ఉత్తర దినాజ్పూర్లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు.
ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.