Home » Tirupati
అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.
తిరుపతిలో మందు బాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రాత్రి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం గోపురం పైకి ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద ఆ వ్యక్తిని కిందకు దింపారు.
రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.
తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో దీనిపై చర్చించలేదని తెలిపారు.
రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.