Home » Tirumala Tirupathi
టోకెన్ విధానంలో సర్వ దర్శనం మూడు నుంచి ఆరు గంటల్లోపు పూర్తవుతుంది. సాధారణంగా చాలామంది భక్తులకు టోకెన్ విధానంపై అవగాహన లేకపోవడంతో నేరుగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకుని సర్వ దర్శనం క్యూలైన్లోకి వెళ్లడంతో..
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
రివర్స్ టెండరింగ్ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలోని అన్నప్రసాద సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రి కనిపించిందంటూ ఓ భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్కు చెందిన చందు అనే యువకుడు స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చాడు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.
కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..
తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఏఆర్ డెయిరీ రెండు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆధారాలను సేకరించింది. ఈ డెయిరీల దగ్గర కొనుగోలు..
Tirumala Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు.
అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.
తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.