Home » Tirumala Tirupathi
గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఆగస్టు 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.
వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
గతంలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.
ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. ఇలా ప్రయత్నిస్తే కోరుకున్నట్టుగా నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.