Home » Tirumala Laddu Controversy
డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా... ఆ నివేదికలోని అంశాలను ‘సిట్’ తన చార్జిషీటులో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా...
పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ సందర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమెకు భక్తులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సర్కార్కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
ఇది కాసుల కోసం కక్కుర్తి! పక్కాగా, ముందస్తు ప్రణాళిక రచించి, అమలు చేసిన కుట్ర! ఒకటీ రెండూ కాదు... ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్వయంగా ఈ విషయం తేల్చింది. ‘మంచిది మాకు అక్కర్లేదు. రంగూ, వాసన ఉంటే చాలు...
టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫైనల్ చార్జ్ షీట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్కోదేనని ధ్వజమెత్తారు.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.