Home » TGSRTC
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.
సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది.
TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
శంషాబాద్(Shamshabad) నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం(Rajiv Gandhi International Airport) మీదుగా తుక్కుగూడకు 2 ఏరో రైడర్ సిటీ ఆర్డినరీ బస్సులను జనవరి 1 నుంచి ప్రారంభి స్తున్నామని గ్రేటర్ఆర్టీసీ ఈడీ సి.వినోద్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో ఆర్టీసీ(RTC) సేవలను మరింత విస్తరించే దిశగా ముందస్తు ప్రణాళికలతో ఆర్టీసీ ముందుకెళుతోంది. వచ్చే ఏడాదిలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్ బస్సులు(Electric buses) గ్రేటర్ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది.
ఆన్లైన్ వేదికగా జరిగే బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ టీజీఎస్ఆర్టీసీ ఎం.డి. వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) ఎక్స్ (ట్విటర్)లో వీడియోను పోస్టు చేశారు.
కూకట్పల్లి(Kukatpally) ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పార్సిళ్లను హోమ్ డెలివరీ చేసేందుకు సేవలకు శ్రీకారం చుట్టింది. దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సేవలను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది.