Home » TG Govt
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు.
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన బకాయిల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా.. ఒక ఒబిడియెంట్ విద్యార్థి లాగా వింటున్నానని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్కి దిగారని గుర్తుచేశారు కవిత.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వియత్నాం బయలుదేరాల్సిన విమానం రన్వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు వియత్నాం ఎయిర్బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .