Home » TG Govt
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు.
శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
మావోయిస్టుల అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం చర్చించారు.
హెచ్ - సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ రోజు ఆ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ విద్యామండలి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కోర్ అర్బన్ రీజియన్లో ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.
తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు.