Home » terror attack
పహల్గామ్ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది. ఈ క్రమంలో మానవత్వం కదిలించేలా చేసిన పలువురి విషాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విశాఖకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందారు.
పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ చేరుకున్నారు. కానీ ఉగ్రదాడి తర్వాత, ప్రధాని మోదీ ఈరోజు ఢిల్లీకి తిరిగి వచ్చారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని భారతీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్ర్భాంతికరంగా అభివర్ణించారు, ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మరోసారి ద్రోహాన్ని రేపింది. హిందువులు, ముఖ్యంగా పురుషులపై ఉగ్రవాదులు దాడి చేసి, వారి ప్రాణాలు తీసిన ఘటనా. హనీమూన్కు వచ్చిన జంట, తండ్రి ప్రాణాలను కోల్పోయిన కుమార్తె వంటి అనేక హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి
జమ్మూకశ్మీర్లో పహల్గాం ఘటనతో ఉగ్రవాదం మళ్లీ కలకలం రేపింది. పర్యాటక రంగం పునరుద్ధరణలో ఉన్న సమయంలో, ఉగ్రవాదుల దాడులతో భద్రతపై ప్రశ్నలు కలుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పర్యాటకులు మరణించగా, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ "రెసిస్టెన్స్ ఫ్రంట్" ఉన్నదని తెలుస్తోంది.