Home » terror attack
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటారీ చెక్పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో బుధవారం సాయంత్రం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.
భారత ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు సైఫుల్లా ముఖ్య సహచరుడుగా వ్యవహరిస్తు్న్నాడు. లష్కరేకి ప్రాక్సీగా చెప్పుకునే 'ది రిసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్), పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్)లను స్థాపించినది కూడా ఇతనే.
Pahalgam Terror Attack: పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చి్స్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్నాథ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు.
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పహల్గాం అమానుష దాడికి పాల్డడిన ముష్కరులను మట్టుబెట్టి, బాధితులకు న్యాయం చేసేందుకు బలగాలు పూర్తి స్థాయిలో దృష్టిసారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
పహల్గాం ఘటనకు నిరసనగా 35 ఏళ్లలో తొలిసారి జమ్మూకశ్మీర్ మూతపడింది. ప్రజలంతా జమ్మూకశ్మీర్ షట్డౌన్లో పాల్గొనాలంటూ మసీదుల్లోని లౌడ్స్పీకర్లలోనూ ప్రకటిస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు.
పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని, అందరూ కలిసికట్టుగా మృుతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాలని పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరాదని అన్నారు.
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద భార్యాపిల్లలతో విహారయాత్ర కోసం మనీష్ రంజన్ కశ్మీర్ వచ్చారు. మరికొందరితో కలిసి మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరాన్ వ్యాలీలో బస చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అతనిని భార్య, పిల్లల కళ్ల ముందే కాల్చిచంపారు.