Home » Telugu states
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిష్కారం కానీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి.. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్లో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్లో స్పందించారు.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సంతోషమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చాపల పులుసు తిన్నారని.. సమస్యల పరిష్కారానికి ఏరోజు చిత్తశుద్ధితో పాటు పడలేదని విమర్శించారు.
Andhrapradesh: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది..
తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తు్న్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..?..
తెలంగాణ(telangana) గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Radhakrishnan) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)తో సమావేశం అయ్యారు.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు.