Home » Telugu states
తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి.
ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్మూన్’ కనువిందు చేయనుంది.
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.
పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను ఆయా ప్రాజెక్ట్లకు తరలిస్తామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు..
Farmers: దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందీ భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో వర్ష పాతం సమృద్ధిగా కురుస్తోందని వివరించింది. అయితే తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం కాస్తా తక్కువగా కురుస్తోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
KRMB: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా నీటి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఈరోజు కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు జారీ చేసింది.