• Home » Telugu Desam Party

Telugu Desam Party

Minister Nimmala Ramanaidu: నాపై సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. మంత్రి నిమ్మల ధ్వజం

Minister Nimmala Ramanaidu: నాపై సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. మంత్రి నిమ్మల ధ్వజం

పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్‌లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Parthasarathy: భయం, ఫ్రస్టేషన్‌తోనే దిగజారి మాట్లాడుతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి పార్థసారథి ఫైర్

Minister Parthasarathy: భయం, ఫ్రస్టేషన్‌తోనే దిగజారి మాట్లాడుతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి పార్థసారథి ఫైర్

జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

TDP MP Sri Bharat: అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ  శ్రీభరత్ ఫైర్

TDP MP Sri Bharat: అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.

Pemmasani: గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్

Pemmasani: గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్

గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి

తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

ఎన్టీఆర్‌ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.

Devineni Uma Slams Jagan: తప్పుడు ప్రచారాలతో సీఎం చంద్రబాబుపై విషం కక్కుతున్నారు.. జగన్‌పై దేవినేని ఫైర్

Devineni Uma Slams Jagan: తప్పుడు ప్రచారాలతో సీఎం చంద్రబాబుపై విషం కక్కుతున్నారు.. జగన్‌పై దేవినేని ఫైర్

ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

CM Ramesh VS KTR: ఆ ఆరోపణలు నిరూపించు.. కేటీఆర్‌కి ఎంపీ రమేష్ మాస్ సవాల్

CM Ramesh VS KTR: ఆ ఆరోపణలు నిరూపించు.. కేటీఆర్‌కి ఎంపీ రమేష్ మాస్ సవాల్

రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి