Home » Telugu Desam Party
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్ను తరిమికొట్టాలని హెచ్చరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఏలూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, వేధింపులు ఎదుర్కొన్న తమకు ఇప్పుడు న్యాయం జరగడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ తుదిశ్వాస విడిచారు. ఈ విషాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..
రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..
పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు..