Home » Telangana Police
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి వివాదంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడు ఎన్నారై ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లుగా చెబుతున్న ఒక వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డులో సెటిల్మెంట్ ప్రతిపాదనలు, బెదిరింపులు ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చినట్లు సమాచారం.
ప్రముఖ నటి అషురెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ఆమె కుటుంబంపై భారీ మోసం ఆరోపణలు నమోదు కావడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.
శంషాబాద్ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్కు సోమవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపుతో భద్రతా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రముఖ సినీ నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలనీలో భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తరచుగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది.
సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం, తాజాగా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యుడు కె. శివకుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు.
ప్రముఖ గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.