Home » Telangana Govt
Bhubharathi Act: భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నరం నిర్ణయం తీసుకున్నారు.
Telangana: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక పిటిషన్ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైన విషయం తెలిసిందే.
Telangana: బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు సమాచారం. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది.
Ration Card: చాలా మందికి రేషన్కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. అసలు రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా నూతన వధువు మెట్టింట్లోని రేషన్కార్డులో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారికి పుట్టే పిల్లల పేర్లను కూడా యాడ్ చేసుకోవాలి.
Telangana: తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధులను సమకూర్చుకుంది సర్కార్. సంక్రాంతి పండుగ నుంచి రైతులు ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్..
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
లగచర్లలో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేసింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్ట్కు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ బుధవారం జీవో జారీ అయ్యింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణను ప్రారంభించారు. ఈరోజు నుంచి మొదటి రెండు రోజులు ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇవ్వనున్నారు. ఆ తరువాత నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలుకానుంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె ప్రగతి నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు కావాలని కానీ.. కేంద్ర పేరు చెప్పేందుకు మాత్రం మనసు రాదంటూ వ్యాఖ్యలు చేశారు.