Home » Telangana Govt
Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వేల ప్రారంభంకానుంది. మూడు విధానాలలో వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది.
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో రెండు ప్రధాన అంశాలపై చర్చ జరిగింది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి మండలి చర్చించింది.
TG Govt: పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జనకు గురవుతోంది. కులగణను సంబంధించిన ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్టును డెడికేషన్ కమిషన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 2 లోపు కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తామని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది.
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.
Telangana Schemes: త్వరలోనే మరో నాలుగు పథకాలను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. అందులో ప్రధానమైనవి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకాల అమలుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.
KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసులో సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
CM Revanth Reddy: తెలంగాణాకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
Danam Nagender: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.