Home » Telangana Assembly
Telangana: తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్లో రూ.321 కోట్లు కేటాయించిందని తెలిపారు.
తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు...
Telangana: తెలంగాణ శాసనసభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని... వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
Telangana: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు.
Telangana: అసెంబ్లీ గన్పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని ముట్టడించేందుకు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు యత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30శాంత నిధులు కేటాయించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions) మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది...
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని... అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆపై ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను మొదలుపెట్టారు. పదేళ్ల క్రితం కిరణ్కుమార్రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సోమవారం సభ చాలా వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఇవాళ కూడా శాసన సభలో ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు.