Home » Tamilnadu News
Andhrapradesh: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే యువనేత అక్కడకు బయలుదేరి వెళ్లారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు.
తమిళనాడులో ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.
వ్యవసాయంలో కొందరు రైతులు నూతన ఒరవడిలు సృష్టిస్తున్నారు. నష్టాల్లో ఉన్న పంటలను లాభదాయకంగా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళనాడుకి చెందిన ఓ రైతు కొంచం విస్తీర్ణంలో పాలకూర సాగు చేస్తూ వేలల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. విల్లుపురం పనంపట్టు ప్రాంతానికి చెందిన మురుగన్ అనే రైతు కొన్నిరోజులుగా పాలకూర పండిస్తున్నాడు.
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
తమిళనాడులోని (Tamilnadu) రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాలల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్లోని (Coimbatore) పీఎస్బీబీ మిలీనియం స్కూల్ (PSBB Millennium School), కాంచీపురం జిల్లాలోని (Kancheepuram District) ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కుప్పం, తమిళనాడు సరిహద్దుల్లోని పాలార్ ప్రాజెక్ట్ వివాదం (Palar Project Controversy) మళ్లీ తెరమీదకి వచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేసిన ప్రకటన కారణంగా.. ఈ వివాదం మరోసారి అగ్గిరాజుకుంది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా.. 0.6 టీఎంసీల కెపాసిటీతో రూ.215 కోట్ల వ్యయంతో చిన్నపాటి రిజర్వాయర్ను (Reservoir) పాలార్ ప్రాజెక్ట్పై నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
తమిళనాడులో (Tamilnadu) ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. వేరే కులానికి చెందినవాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. అమ్మాయి తరఫు బంధువులు ఆమె భర్తను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో బాధితురాలి బావతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడ్ని మెకానిక్గా పని చేస్తున్న ప్రవీణ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చెన్నై (Chennai) నగరానికి సమీపంలోని పల్లికరణై ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది.
మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘డ్రగ్ రాకెట్’ (Drug Racket) ఒకటి. దీనిని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇల్లీగల్గా ఈ దందా నడుస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇది మరింత విస్తరించడంతో.. అధికారులు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి, డ్రాగ్ రాకెట్ నెట్వర్క్లను ఛేధిస్తున్నారు. తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది.
పోలీసులు (Police) ఉన్నది సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం.. సమస్యల నుంచి బయటపడేసి వారికి న్యాయం అందించడం కోసం! కానీ.. కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలకు పాల్పడుతుంటారు. సహాయం కోసం తమ వద్దకు వచ్చిన బాధితులనే వేధింపులకు గురి చేస్తుంటారు. తాజాగా తమిళనాడులోనూ (Tamilnadu) ఓ అధికారి భక్షకుడిగా ప్రవర్తించాడు.
చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ (CAG) ఈ పథకం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ‘టువర్డ్స్ జెండర్ ఇన్క్లూసివ్ ట్రాన్స్పోర్ట్’ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా.. తమిళనాడులోని చెన్నై (Chennai), కోయంబత్తూర్, సేలం, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, తిరువారూరు వంటి నగరాల్లో మొత్తం 3వేల మంది మహిళల్ని CAG ఇంటర్వ్యూ చేసింది.