Home » Suryapet
జిల్లాలోని హాలియాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు పడడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్లో, డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో వ్యవసాయ సహకార సంఘాలకు రైతాంగం క్యూ కట్టింది.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు.
బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అద్భుతంగా మరోసారి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు.
సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఇతర పార్టీల నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా ఓ యూనిట్ను నిర్మిస్తున్నారు. ఈ నూతన యూనిట్ - 4 వద్దే ప్రమాదం చోటు చేసుకుంది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా హఠాత్తుగా లిఫ్ట్ కూలి కిందపడింది. దీనికింద కాంట్రాక్ట్ కార్మికులు కొందరు చిక్కుకుపోయారు.
తెలంగాణలో అతిపెద్ద జనాభా ఉన్న మాదిగలను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు న్యాయం జరగడం లేదని మందుల సామేల్ రాజీనామా చేయడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ మాదిగలను వంచిస్తున్నారు.
సూర్యాపేట: ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులేనని విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణసింగ్ డీజే టిల్లుగా మారారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో కలిసి నృత్యంచేశారు. తన హోదాను మరిచి ఆనందంతో కేరింతలు కొట్టారు. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసి తనకు ఉన్న కళాభిరుచిని చాటుకున్నారు. ఒక పోలీస్ అధికారి విద్యార్థులతో కలిసి నృత్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.