Home » Student
బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారం జరిపినట్టు భావిస్తున్న ఐఐఎం హాస్టల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది గంటలకే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈఏపీ సెట్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువుంది. డీటీ లేరని శ్రీకాళహస్తిలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు.
కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులని ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకి గురిచేశాడు. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకి పాల్పడ్డాడు.
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.
కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో విషాద ఘటన జరిగింది. స్కూల్కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మైల్వార్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన శనగన హరి కిరణ్ గౌడ్ 25 అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు.
MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.