• Home » Srirama Navami

Srirama Navami

Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు

Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు

ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి, మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అనే మాటలోని ‘అయనం’ అంటే నడక అని అర్థం. రామాయణం అంటే ‘రాముని నడక’ అని అర్థం. అంటే ఆయన జీవించిన విధానం. పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడు.

సిద్ధమైన సీతమ్మ బంగారు చీర

సిద్ధమైన సీతమ్మ బంగారు చీర

Sitamma Gold Saree: సీతమ్మ వారికి బంగారు చీర సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మ కోసం సిరిసిల్ల నేతన్న గోల్డ్ చీరను నేశారు.

PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ

PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ

తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..

Chandrababu: అందరికీ నవమి శుభాకాంక్షలు.. ప్రజల ఆనందమే ముఖ్యమని చెబుతోంది రామకథ..

Andhrapradesh: ప్రజలందిరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత స్పందిస్తూ.. ‘‘తేత్రాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అంటే దానికి కారణం... ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతుంది’’ అని చంద్రబాబు అన్నారు.

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

Telangana: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.

Ram Navami 2024 Live: వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం.. భద్రాచలం నుంచి లైవ్ మీకోసం..

Ram Navami 2024 Live: వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం.. భద్రాచలం నుంచి లైవ్ మీకోసం..

Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్,

EC: భద్రాచల రామయ్య కళ్యాణ వేడుక లైవ్ టెలికాస్ట్‌కు ఈసీ నో..?

EC: భద్రాచల రామయ్య కళ్యాణ వేడుక లైవ్ టెలికాస్ట్‌కు ఈసీ నో..?

శ్రీరామ నవమి పర్వదినం రోజున భద్రాచలంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైకుంఠం నుంచి కొలువుదీరిన చతుర్భుజ రామునిగా భద్రాద్రి రామునికి పేరు ఉంది. వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

TG Politics: శ్రీరామ కళ్యాణ మహోత్సవంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో రేపు(బుధవారం) జరిగే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిలిపివేసింది. కళ్యాణాన్ని ఈసీ నిలిపివేయడంతో ఈ చర్యలను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వివరించారు.

Hyderabad: మరమరాల పందిరిలో... రాములోరి కల్యాణం

Hyderabad: మరమరాల పందిరిలో... రాములోరి కల్యాణం

సైదాబాద్‌, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో మరమరాలు... వేరుసెనగలతో తీర్చిదిద్దిన పందిరిలో 39 సంవత్సరాలుగా సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కల్యాణంతో ముగుస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి