Home » South Central Railway
bhagyanagar express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్ను రద్దు చేసింది.
ప్రయాణికులు రైల్వే టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరింత సులువైన మార్గాలను ప్రవేశపెడుతోంది. ఇకపై రైల్వేస్టేషన్లలో సాధారణ టికెట్లతో పాటు రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ చార్జీల చెల్లింపునకు మెరుగైన క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకువచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.
క్రిస్మస్, మహాకుంభ మేళా(Christmas, Mahakumbh Mela) పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) తెలిపారు.
సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.
Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్లలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తోందని, గత నాలుగు (ఏప్రిల్-జూలై) నెలల్లో రూ.6,984 కోట్ల ఆదాయాన్ని సాధించిందని జీఎం అరుణ్కుమార్ జైన్(GM Arun Kumar Jain) తెలిపారు.
కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.