Home » Sonia Gandhi
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
అమేఠీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆమె మాట్లాడుతూ.. రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగడం.. అమేఠీ ప్రజల విజయమని ఆమె అభివర్ణించారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
రాయ్బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీకి వరుస షాక్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు పరిశీలకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశమంతా నన్నే కోరుతోంది.
తమ పదవులు, రాజకీయ భవితవ్యం... సోనియా, రాహుల్గాంధీ కష్ట ఫలితమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్గాంధీని హత్య చేసిన వారినే క్షమించేసిన గుణం సోనియా, రాహుల్, ప్రియాంకది అని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. అర్థం, పర్థం లేని వ్యాఖ్యలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో దీర్ఘకాలంగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి రాహుల్ పారిపోయారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అమేథిలో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసి గెలుపొందారు. దీంతో తనకు సురక్షితమైన సీటుగా భావించి..
స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసింది. సాధారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురుకానుంది.