Home » Sonia Gandhi
తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.
తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.
: రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ ఆధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
రాయ్బరేలీ నియోజకవర్గంతో తనకు కుటుంబ బంధం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యమని విమర్శించారు. మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.