Home » Sonia Gandhi
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు(జూన్ 2) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని(Sonia Gandhi) ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది.
ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెబితే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ.. ఆ ఇద్దరు ఓటు ఎవరికి వేస్తారని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తు.. కానీ ఈ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు హస్తం గుర్తుకి ఓటు వేయలేదు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేడుకల నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి..
పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్లైన్గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.
దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే.. బహుళ జాతి కంపెనీల కోసమే బీజేపీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పోరాడుతుంటే..
దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విజ్జప్తి చేశారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లకు ఆమె సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు తెలిపారు.
బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తే తప్పెంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఏ హోదాలో సోనియా గాంధీని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని మాట్లాడటం సరికాదని సూచించారు.