Home » Sonia Gandhi
ఎగ్జిట్ పోల్ నివేదికలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్సే దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 14 శాతంగా ఉన్న మైనారిటీ ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.
పోల్స్టర్స్ ఏదైతే అంచనా వేశారో దానికి పూర్తి భిన్నంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియగాంధీ అన్నారు. ''ఏం జరుగుతుందో వేచి చూద్దాం'' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ నేవూరి మమత-వెంకట్రెడ్డి
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని, తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చిందని మండిపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ..
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్(Karimnagar)లో హామీ ఇచ్చానన్నారు.
మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.
‘‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.