• Home » Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మన దేశంలో అత్యుత్తమ స్మార్ట్ సిటీగా, ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి.

Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

Shivraj Singh : మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం కోసం అమిత్ షా వినూత్న వ్యూహం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచారు. 2003 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాలు వెనుకబడిన రాష్ట్రమనే నానుడిని తొలగించడంలో విజయం సాధించినట్లు తెలిపారు.

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

Digvijaya Singh: మతం పేరుతో ఓట్లు అడగడం చట్టరీత్యా నేరం.. 150+ సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో...

Priyanka Gandhi : ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..

Priyanka Gandhi : ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు.. ఎందుకంటే..

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

Kanwar yatra : కన్వర్ యాత్రపై రాళ్ల దాడి.. మధ్య ప్రదేశ్ పోలీసుల లాఠీఛార్జ్..

Kanwar yatra : కన్వర్ యాత్రపై రాళ్ల దాడి.. మధ్య ప్రదేశ్ పోలీసుల లాఠీఛార్జ్..

మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో కన్వర్ యాత్రలో పాల్గొన్న మహాశివుని భక్తులపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కహర్వాడీ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ యాత్ర సజావుగానే సాగింది.

Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Madhya Pradesh : గ్రామ సర్పంచ్ విధించిన వింత నిబంధన.. ఆవులను వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు..

Madhya Pradesh : గ్రామ సర్పంచ్ విధించిన వింత నిబంధన.. ఆవులను వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు..

పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు. మధ్య ప్రదేశ్‌లోని నాగనడుయి గ్రామ సర్పంచ్ కూడా అలాంటి ఆదేశాలనే జారీ చేశారు. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించారు.

Madhya Pradesh : గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితునికి పోలీస్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు

Madhya Pradesh : గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితునికి పోలీస్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు

: మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిని అవమానించిన బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా పోలీస్ స్టేషన్‌లోకి దర్జాగా వెళ్తున్నట్లు ఓ వీడియోలో కనిపించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు.

Shivraj Singh Chauhan: కాళ్లు కడిగి, క్షమాపణ చెప్పిన సీఎం.. అసలేం జరిగిందంటే..

Shivraj Singh Chauhan: కాళ్లు కడిగి, క్షమాపణ చెప్పిన సీఎం.. అసలేం జరిగిందంటే..

మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) క్షమాపణ చెప్పారు. బాధితుని పాదాలను కడిగి, శాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటు, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన సంగతి తెలిసిందే.

Madhya Pradesh Election: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు కాలి బూడిదైన 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైల్స్...

Madhya Pradesh Election: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు కాలి బూడిదైన 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైల్స్...

మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సాత్పుర భవన్‌లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ సంఘటనలో రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్ కాలిపోగా, 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైళ్లు బూడిద కుప్పగా మిగిలిపోయాయి. ఇదంతా కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ముఖ్యమైన ఫైళ్లు ధ్వంసం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి