Home » Sharad Pawar
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు టు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని చెప్పారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ యాక్షన్ మోడ్లోకి వచ్చారు.బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిపోయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇదంతా తమాషాగా మారిపోయిందని, చట్టమే ఇటువంటివాటికి అనుమతిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం మాట్లాడబోతున్న తరుణంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ మాట్లాడారు.
పవార్ల మధ్య పవర్ గేమ్లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రావడంతో మహారాష్ట్రలో అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న శరద్ పవార్ (Sharad Pawar)కు సంఘీభావం ప్రకటిస్తూనే, తమ పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్తున్నారు.