• Home » Sharad Pawar

Sharad Pawar

Maharashtra: ఒకే వేదికపై ఆ ముగ్గురు...

Maharashtra: ఒకే వేదికపై ఆ ముగ్గురు...

మహారాష్ట్రలోని ఎన్‌సీపీలో తిరుగుబాటు అనంతర క్రమంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ , తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికపైకి రాబోతున్నారు. మోదీకి ఆగస్టు1న లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును పుణెలో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథిగా శరద్ పవార్, అజిత్ పవార్ పాల్గోనున్నారు.

Sharad Pawar: కొందరిని గుడ్డిగా నమ్మి తప్పుచేశా.. క్షమించండి..!

Sharad Pawar: కొందరిని గుడ్డిగా నమ్మి తప్పుచేశా.. క్షమించండి..!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరినీ తప్పుపట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్‌సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుచ్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

Sharad pawar: అలసటా లేదు, రిటైర్మెంట్ లేదు, నేను నిప్పుని...

Sharad pawar: అలసటా లేదు, రిటైర్మెంట్ లేదు, నేను నిప్పుని...

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు టు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని చెప్పారు.

NCP Vs BJP: 2024లో మరాఠా పీఠం మాదే: శరద్‌పవార్

NCP Vs BJP: 2024లో మరాఠా పీఠం మాదే: శరద్‌పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు.బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.

Sharad Pawar Vs Ajit Pawar : శరద్ పవార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ బాసట

Sharad Pawar Vs Ajit Pawar : శరద్ పవార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ బాసట

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిపోయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇదంతా తమాషాగా మారిపోయిందని, చట్టమే ఇటువంటివాటికి అనుమతిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం మాట్లాడబోతున్న తరుణంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

NCP Crisis: ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్...జూన్ 30నే తీర్మానం జరిగిందన్న రెబల్ వర్గం

NCP Crisis: ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్...జూన్ 30నే తీర్మానం జరిగిందన్న రెబల్ వర్గం

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్‌సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు.

Supriya Sule: టాటా, అమితాబ్‌‌ బచ్చన్‌ను చూడు?... అజిత్‌కు పవార్ కుమార్తె కౌంటర్

Supriya Sule: టాటా, అమితాబ్‌‌ బచ్చన్‌ను చూడు?... అజిత్‌కు పవార్ కుమార్తె కౌంటర్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.

Sharad Pawar: పార్టీ గుర్తు మాతోనే ఉంది, ఎక్కడికీ పోలేదు..

Sharad Pawar: పార్టీ గుర్తు మాతోనే ఉంది, ఎక్కడికీ పోలేదు..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ మాట్లాడారు.

Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

పవార్‌ల మధ్య పవర్ గేమ్‌లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్‌సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి