Home » School life
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
సంక్షేమ పథకాలు కేవలం సరఫరాదారుల లాభం కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వస్తువుల కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు అన్నిరకాల వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారానే సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ,స్పెషల్ టీం, ఎచ్ న్యూ మొత్తం 5000 మంది సిబ్బంది ఈ రైడ్స్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
AP లో కూటమి ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లో కూడా పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపానికి గురికాకుండా ఉండేందుకు 'డ్రై రేషన్' పంపిణీ కార్యక్రమాన్ని తొలిసారిగా చేపట్టింది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు.
కోర్ అర్బన్ రీజియన్లో ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
సత్యనారాయణ మాస్టరుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత నిధులు, దాతల సహాయంతో స్కూల్ను తీర్చిదిద్దారని కొనియాడారు.
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..