Home » Sankranthi
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు.. తన సొంతూరు నారా వారి పల్లెకు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తొలుత తిరుపతిలో ఆగనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
భోగిపండ్లు పొయ్యటం సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు వచ్చేదే భోగి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతినాడు కూడా జరుపుకొంటారు.
సంక్రాంతికి ధనుర్మాసంలో తెలుగు లోగిళ్లలో వాకిళ్ల ముందు తీర్చిదిద్దే ముగ్గులు మహిళల్లోని నైపుణ్యాన్ని, సమర్థతను ప్రతిబింబిస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. వీటితో పాటు గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. చిన్నా, పెద్దా తేడా మరిచిపోయి ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. అయితే ఇలా గాలిపటాలు ఎగురేసేందుకు కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?
సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, సంప్రదాయాలకు పర్యాయపదం. ముగ్గులు, కోడిపందేలు, భోగిమంటలు, పిండివంటలు ఇలా ఎన్నున్నా.. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది పతంగులు ఎగరేయడం. ఈ విషయంలో పెద్దలూ చిన్నపిల్లలుగా మారిపోయి గాలిపటాలు ఎగరేసేందుకు ఎగబడతారు. అంతా కలిసి ఆకాశాన్ని రంగుల హరివిల్లులా మార్చేస్తారు. అయితే, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సరదా కాస్త విషాదంగా మారే ప్రమాదముంది. కాబట్టి, పతంగులు ఎగిరేసేటప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి..
Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు రైళ్లను నడపాడానికి దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
కొందరి సరదా మరికొందరికి గాయాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పంతగులకు వాడుతున్న చైనా మాంజా. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా(China manja)ను అధికారులు నిషేధించారు.
Telangana: హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్లాయి. నిన్నటి (శుక్రవారం) సాయంత్రం నుంచే రద్దీ మొదలైంది.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. దైవ దర్శనాలు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా పండుగ హడావుడి మామూలుగా లేదు. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్.
సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల నిర్వహణకు హైటెక్ హంగులతో బరులు సిద్ధమవుతు న్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెం చర్లో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎల్ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్ప టికే పందెం రాయుళ్లు హను మాన్జంక్షన్లో హోటల్ రూమ్ లను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.