Home » sankranthi
భోగి పండుగ అంటే భోగి మంటలతో పాటు చిన్నారులపై భోగి పండ్లు పోసే ముచ్చటైన దృశ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది.. భోగి పండ్లు పోసే విధానం, నియమాలు, వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి అంటే చాలు.. హరిదాసుల హరినామ సంకీర్తనలు, గంగిరెద్దుల గజ్జెల శబ్దాలతో ఊరువాడ పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. కానీ ఈ సంప్రదాయాలు సంక్రాంతికే ఎందుకు కనిపిస్తాయి? హరిదాసులు, గంగిరెద్దుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసుకుందాం..
పుడమి తల్లిని నమ్ముకున్న పల్లెవాసుల సంతృప్తి, ఆనందాలకు ప్రతీక సంక్రాంతి. ధనుర్మాసంలో స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్రతం ఆచరించి యశోదా తనయునికి బాల భోగం సమర్పించి హారతి ఇస్తారు. యువతులు నెల రోజులు ముంగిట్లో కళ్లాపి చల్లి రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గులపై గొబ్బెమ్మలను ఉంచి బంతి, చామంతి, తంగేడు, గుమ్మడి పూలతో అలంకరించి పసుపు కుంకుమతో పూజిస్తారు. సంక్రాంతి అంటేనే సంప్రదాయాల పండుగ కావడంతో.. ప్రత్యేక వంటలు రుచితో పాటు మంచి ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
సంక్రాంతి పండగ శోభతో అటు పల్లెలు.. ఇటు పట్టణాలు కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. నేడు భోగి సందర్భంగా.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. భోగి నుంచి కనుమ వరకూ ఎక్కడ చూసినా పందేల హడావిడి ఉత్కంఠగా కనిపిస్తుంది.
సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు కనిపిస్తాయి. అయితే.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? పండుగ రోజు ఎందుకు ముగ్గులు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే, చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోంది. కాబట్టి, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం..
సంక్రాంతి సందర్భంగా గాలి పటాలు ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజా ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. హైదరాబాద్ ఉప్పల్లో నల్లగుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా వల్ల రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
సంక్రాంతి పండుగ రోజు దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే, ఈ గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.